సుందర సత్సంగ సభ్యులకు
స్వామీజీ సందేశం #స్వామీజీ శష్టి పూర్తి
నేను సుందర సత్సంగ సభ్యుల నంతా కోరేది ఒక్కటే. నలభై సంవత్సరాలుగా వేదిక ఎక్కుతూ వేదిక దిగుతూ మీ కోసం నా కంఠాన్నంతా నేను అరగదీశాను. చాలా ఆనందంతో చేశాను ఈ పని, బాధతో చేయలేదు. మీరందరూ నిద్రపోతుంటే మీకు గ్రంథాలు రాసిచ్చాను. మీరందరూ విశ్రాంతి తీసుకుంటుంటే మీ కోసం క్యాసెట్లు పాడించాను. కానీ ఒక్కటి మాత్రం మీకు నేను చెప్తున్నా, ఇది కాదు ఇప్పుడు మనం చేయాల్సింది. మనల్ని చూసి ఇప్పుడు పోతూ ఉంటే ఒక మల్లెపూవు ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు పక్కన మల్లె తోట ఉందనుకోండి. గోడ ఉంది, గోడ కిందున్నాయి మల్లె చెట్లు. మనం పోతూ ఉన్నాం. వస్తది వాసన, వస్తది వాసన. అరే ఇక్కడ ఎక్కడో మల్లె చెట్టు ఉన్నట్టుందే! ఇంత సువాసన ఎక్కడిది? ఇంత సుగంధం ఎక్కడిది? అనుకుంటాడే. దాని దగ్గరికి వెళ్తాడు చూసారా. ఆ విధంగా ప్రతి సుందర సత్సంగ సభ్యుడు మీరు బోధించడం కాదు నాకు కావలసింది. మీరు పుస్తకాలు అందించడం కాదు నాకు కావలసింది. మీ జీవన విధానాన్ని చూచి,... నా జీవన విధానాన్ని చూచి అబ్బా! ఇట్లా కూడా బ్రతికే అవకాశం ఉందా? ఈ సమాజంలో ఇంత ప్రశాంతంగా జీవించే అవకాశం ఉందే? ఇంత హాయిగా బ్రతికేటువంటి అవకాశం ఉందే? ఎప్పుడూ నవ్వుతూ ఉండేటువంటి అవకాశం ఉందే? ఇది ఎలా వచ్చింది వీళ్ళకి? అయ్యా వీళ్ళు సుందర సత్సంగ్ సభ్యులు కావడం ఏమి అక్కడేమన్నా మాయలు ఉన్నాయా? మహిమలు ఉన్నాయా? తాయత్తులు ఉన్నాయా? ఏమీ లేవయ్యా ఇంకేం జరుగుతా ఉంది అక్కడ? ఇదిగో ఇది జ్ఞానం. అంటే ఈ జ్ఞానంతోనే అంత హాయిగా ఉండొచ్చా? ఉండొచ్చు. ఎందుకని? యుగయుగాలుగా తరతరాలుగా మన వాళ్ళంతా అట్లాగే ఉన్నారు. ఇటువంటి సంస్కృతిని ఈ సనాతన ధర్మ జీవన విధానాన్ని అందరి హృదయాల్లోకి తీసుకెళ్లి పెట్టాల.

No comments:
Post a Comment