Sunday, July 23, 2023

Wednesday, July 19, 2023

ఈ స్వామి 90 రోజుల్లో మీ కోరికలు తప్పనిసరిగా తీరుస్తాడు| very near to Hyderabad | Powerful Temple

375,605 views Jul 8, 2023 NALGONDA This is about 500 years old Venkateswara temple. Who will solve your problems within 90 days. This temple is located at just 80 kms from Hyderabad. With greenery and great ambiance this temple gives you very peace to devotees. To know history and significance of the temple please watch this video and Like if you really like, share and comment. Thank you. LOCATION: https://www.google.com/maps/place/Venkateswara+Swamy+Temple/@17.2944035,79.2345357,17z/data=!3m1!4b1!4m6!3m5!1s0x3bcb372ffaaa5d01:0x71ecc462ef8af4d0!8m2!3d17.2944035!4d79.2345357!16s%2Fg%2F124stygdn?entry=ttu TEMPLE TIMINGS: Every day 6am to 12:30pm, 5pm to 7:30pm Saturday 6am to 1pm, 5pm to 7:30pm సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 7am నుండి 12-30pm సాయంత్రం 5pm నుండి 7-30pmవరకు శనివారం ఉదయం 6-30am నుండి 1pm వరకు సాయంత్రం 5pm నుండి 7-30వరకు TRANSPORTATION: There are few buses from Narketpally. Autos will available any time. CONTACT DETAILS: ఆలయ పూజారి శ్రీ కృష్ణమాచార్యులు 9849508858 (ఆచార్యులు ఎప్పుడూ పూజలో ఉంటారు. కాబట్టి అత్యవసరమైతేనే ఫోన్ చేయండి. కృతజ్ణతలు) Video Link: https://www.youtube.com/watch?v=Izk5C0TjQPM&t=0s • ఈ స్వామి 90 రోజుల... Also watch my other videos : • Other than List Channel Link: https://www.youtube.com/channel/UCDTxM7FdHVoQTnFEUX5mlSw Contact me on my GMail: teluguthoughts2022@gmail.com

నమస్తే తెలంగాణ - ప్రతిపక్షాల ప్రేలాపనలు: గోగుల రవీందర్ రెడ్డి - 95022 52229

నమస్తే తెలంగాణ ప్రతిపక్షాల ప్రేలాపనలు 
 95022 52229 గోగుల రవీందర్ రెడ్డి 18/07/2023 | Hyderabad Main | Page : 13 Source : https://epaper.ntnews.com/ ప్రతిపక్షాల ప్రేలాపనలు పరాయి పాలనలో తెలంగాణ ప్రజలు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లేవారు. కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ పాలనలో ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వలసలు. వస్తున్నారు. కారణం ఇక్కడ బతుకు దెరువు లభించడమే. వలసపోయిన తెలంగాణ బిడ్డలను మళ్లీ సొంత రాష్ట్రానికి చేర్చుతున్నాడు. ఇది కదా నాటి కాంగ్రెస్ పాలనకు, నేటి కేసీ ఆర్ పాలనకు మధ్య గల తేడా. దేశాన్ని కాంగ్రెస్, బీజేపీలే ఎక్కువకాలం పాలించాయి. అయినా అభివృద్ధి ఎందుకు జరుగలేదో తెలంగాణ ప్రజలకు ఆ పార్టీలు సమాధానం చెప్పాలి. కేసీఆర్ పాలనలో ఇంకా గొప్పగా బతికే రోజులు మున్ముందు చూస్తామనే భరోసా రాష్ట్ర ప్రజల్లో ప్రబలంగా ఉన్నది. ఉమ్మడి ఏపీలో అధికారులు 2013లో వెనుకబడ్డ జిల్లాలను, ప్రాంతాలను గుర్తించడం కోసం సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో తెలంగాణలో నాడున్న 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడినవేనని తేలింది. సర్వే సమయంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే. అంటే పాలకులు వారే, సర్వేలు చేసింది కూడా వారే. మరి వారి పాలనలో తెలంగాణ జిల్లాలు ఎందుకు వెనుకబడ్డాయి? అయినా మా పాలన గొప్పదని చెప్పుకోవటం సిగ్గుచేటు. నాటి సీమాంధ్ర పాలనలో తెలంగాణలో నీళ్లకూ కరువు. భూగర్భజలాలు అడుగంటినయి. పచ్చదనం దెబ్బతిన్నది. వ్యవసాయానికి సాగు నీళ్లు, కరెంటు ఇవ్వలేని పరిస్థితి. కల్తీ విత్తనాలు. కల్తీ ఎరుపులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అరకొరగా పండిన పంటను అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలు లేవు. పేరుకు ఉచిత కరెంటే, కానీ అది ఎప్పుడూ ఉండదు. మీరిచ్చామని చెప్పుకొంటున్న కాలంలో ఇచ్చిన ఉచిత కరెంటు ఎంత? సాగైన వ్యవసాయం ఎంత? పండిన పంట ఎంతనో కాంగ్రెస్ పార్టీ బయటపెట్టాలి. ఇప్పుడు సాగైన విస్తీర్ణం ఎంత? పండిన పంట ఎంతనో లెక్కతీద్దాం. దీనికి కాంగ్రెస్ పార్టీ సిద్దమా? నిజాలను వక్రీకరించి మేమేదో ఉద్ధరించాం. ఒరగపెట్టాం అంటూ అడ్డగోలుగా ఒర్రుడెందుకు? నాడు చెరువుల పరిస్థితి ఏమిటో తెలియంది ఎవరికి? వందలాది చెరువులు పూడుకుపోయాయి. ఆ చెరువులను పట్టించుకునే నాథుడు లేదు. ఇదేనా కాంగ్రెస్ మార్క్ పాలన అంటే. అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం మోటరు వేయడానికి పోతే పాముకాటు, విద్యుత్తు షాక్ తో ఎంతోమంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారికి ఆర్థిక సాయం అందుడు మాట అటుంచితే కనీసం వారి కుటుంబాలను కూడా నాయకులు పరామర్శించిందిలేదు. కానీ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇస్తున్నది. అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పంట. పెట్టుబడి సహాయం, రైతన్నకు బీమా డబ్బులు కట్టి ఆ కుటుంబానికి 5 లక్షల భరోసా కల్పిస్తున్నది. మాది ఇందిరమ్మ పాలన అంటూ గొప్పలకు పోయే కాంగ్రెస్ పార్టీ నాయకులు నాడు రైతుకోసం ఇన్నిసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టలేకపోయారో ఒక్కరైనా సమాధానం చెప్తారా? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలన మరింత అధ్వాన్నం. నల్ల చట్టాలను ప్రవేశపెట్టి రైతులపై బలవంతంగా రుద్దాలని మొండిగా వ్యవహరించింది. దాన్ని వ్యతిరేకిస్తూ వేలాదిమంది రైతులు ఢిల్లీ రోడ్లమీద నెలల తరబడి ఆందోళనలు చేశారు. ఆ సమయంలో అనేకమంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. రైతులపైకి కార్లు ఎక్కించి చంపిన చరిత్ర బీజేపీది. అంతేకాదు, రైతులంటే పడని బీజేపీ మోటర్లకు కరెంటు మీటర్లు బిగించాలని రాష్ట్రాల మీద ఒత్తిడి తెస్తున్నది నిజం కాదా? కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం దండుగ అనే పరిస్థితి నుంచి కేసీఆర్ పాలనలో 'పండుగ' చేసుకుంటున్న రైతులమీద కక్షగట్టి 24 గంటల విద్యుత్తు వద్దు 3 గంటలేచాలని రైతులను భయపెడుతున్నది. యావత్తు భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ఎన్నో అవార్డులు అందుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. కేంద్రంలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాకపోయినా జరుగుతున్న అభివృద్ధి, నిస్వార్ధపాలనకు అవార్డులు ఇవ్వకతప్పని పరిస్థితి కేంద్ర ప్రభుత్వానిది. దీన్నిబట్టే ఎవరి పాలన గొప్పదో అర్థమవుతున్నది. ప్రజలు కూడా అన్ని విషయాలు గమనిస్తూనే ఉన్నారు. వారిని మోసం చేయడానికి నోటికి ఏది వస్తే ఆది వాగుతం అంటే అబద్ధాలు నిజాలు కావనే విషయాన్ని ఆ రెండు పార్టీలు గుర్తెరగాలి. ఉమ్మడిపాలనలో రాని పెట్టుబడులు నేడు తెలంగాణకు వస్తున్నాయంటే కేసీఆర్ పాలన మీద ఉన్న నమ్మకం. చేతనైతే రెండు పార్టీలు వారి పాలనలో జరిగిన అభివృద్ధిపైనా ప్రజాక్షేత్రంలో చర్చ పెట్టాలి తప్ప, అడ్డ దిడ్డంగా అరవడం సరికాదు. చిత్తశుద్ధి కలిగిన నాయకుడిగా, నిస్వార్థ పాలకుడిగా కేసీఆర్ పాలన ప్రతి గడపకు చేరింది. రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న పథకం అందని ఇల్లు లేదు. ఆ విధంగా ప్రజల మనసులో బీఆర్ఎస్ స్థానం సంపాదించుకున్నది. కాంగ్రెస్, బీజేపీలు దాన్ని చెరిపేసే ప్రయత్నాలు మానుకుంటే మంచిది. లేకుంటే ప్రజలే చరమగీతం పాడుతారు. 95022 52229 గోగుల రవీందర్ రెడ్డి

Tuesday, July 18, 2023

నమస్తే తెలంగాణ NEWS PAPER 19 జూలై 2023

#పారమార్థికపారిజాతాలు#ఆధ్యాత్మిక_సులభసాధనోపాయాలు#3_పరమాత్మకోసం_పరితపించు#4_గురువువాక్కే_స్వామివాక్కు

PARAMARDHIKA PARIJATALU.pdf: https://drive.google.com/file/d/1PQL7iokEwZ8y7dUAJjV71UtY9JCqsSco/view?usp=sharing

పారమార్థిక పారిజాతాలు_ఆధ్యాత్మిక సులభ సాధనోపాయలు

PARAMARDHIKA PARIJATALU.pdf: https://drive.google.com/file/d/1PQL7iokEwZ8y7dUAJjV71UtY9JCqsSco/view?usp=sharing https://docs.google.com/document/d/14mKrtgLbz8H3uN2BbSUMgl7_ovEwAiqSWLc2lHOxi1s/edit


BOOK DOWNLOAD LINK: https://drive.google.com/open?id=1Ki3dgYGSC3bRzG08AmYZ_fBQxJJjcwKB
ప్రస్తావన
జే వయాత్రలో మానవాళికి సద్గురువు అమృతవాణి, నావికునికి దిక్సూచి యంత్రం లాంటిది. వారి దివ్యోపదేశాలు సాధకులందరికీ తోడునీడలు. 'అవి భగవత్ర్పాప్తికి మార్గదర్శకాలు. తపస్సు అంటే ఏమిటి? దేవుడున్నాడా? మనస్సును నియంత్రించడం ఎలా? - దేహమే దేవాలయం, సత్సాంగత్యపు విలువలు, ఇత్యాది వివిధ జిజ్ఞాసపరమైన విషయాలకు మహనీయుల ఉపదేశాలే సరైన జవాబు కాగలవు. భగవాన్ శ్రీరామకృష్ణులకు కాళీవరప్రసాదలబ్ద మానసపుత్రుడైన స్వామి బ్రహ్మానంద ఆ మహనీయుల కోవకు చెందినవారు. | అధ్యాత్మ విద్యా విద్యానామ్' అన్నట్లు సమస్త విద్యలకు శిరోభూషణమైనది బ్రహ్మవిద్య. ఆ విద్య స్వామి బ్రహ్మానందకి ఎంతగా కరతలామలకమై భాసిల్లినదో ఆయన ఉపదేశాలే అందుకు తార్కాణాలు. ఆధ్యాత్మిక తత్త్వాన్ని అవగతం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. అలాంటి తాత్త్విక విషయాలను ఎన్నింటినో, సాధనా రహస్యాలను ఎన్నిటినో స్వామి బ్రహ్మానంద తన బోధనల ద్వారా అరటిపండు ఒలిచి చేతికందించినంత తేలికగా విశదపరిచారు. అనేక సందర్భాలలో తమ భక్తులకు, శిష్యులకు స్వామి బ్రహ్మానందులు చేసిన ఉపదేశాలు వంగభాషలో 'ధర్మప్రసంగ'మనే పుస్తక రూపంలో వెలువడింది. అది మూలరూపంలోను, అనువాద రూపంలోను ఖండఖండాంతరాల్లో వ్యాప్తిగాంచింది. స్వామి వారి దివ్యవచనాలు మహోన్నత భావాలనే పారిజాతాల సౌరభాన్ని ప్రపంచం నలువైపుల వెదజల్లి జనుల హృదయాలను గుబాళింప చేశాయి, చేస్తూన్నాయి. స్వామి ప్రభవానందచే కూర్చి, శ్రీరామకృష్ణ మఠం, చెన్నై వారిచే ప్రచురించబడిన "The Eternal Companion - Life and Teachings of Swami Brahmananda' ఈ పుస్తకానికి మూలం. ఆధ్యాత్మిక జ్ఞానపిపాసులకు ఈ పుస్తకం ఒక వరమనే చెప్పాలి. ఆస్వాదించండి, మీకే తెలుస్తుంది. - ప్రకాశకులు
పారమార్థిక పారిజాతాలు_ఆధ్యాత్మిక సులభ సాధనోపాయలు
• నాయనా! ఆత్మవిశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోవద్దుభగవంతుడు నీకు సకలం చేకూరుస్తాడు. భగవంతుని పట్ల ప్రగాఢ విశ్వాసం కలిగివుండు. ఆయన నామజపం చేయి. ఆయనే నీకు మనోబలాన్ని ప్రసాదిస్తాడు. ఆందోళన చెందక, ఓర్పు వహించి, ఒడుపుగా ప్రయత్నించు. సాధనానుష్టానం కొనసాగించు. అప్పుడు భగవదనుగ్రహం తప్పక పొందగలవు. అమూల్యమైన కాలాన్ని అర్థంపర్థంలేని ఆలోచనలతో వ్యర్థంచేసుకోకు. మెట్ట వేదాంతాన్ని కట్టి పెట్టు. విషయవాంఛలను నీలో తలెత్తనివ్వకు;సత్పలితం అందుకొంటావు, భగవత్కృప పొందగలవు.
 ఈ శ్రద్ద జనిస్తే, గవ్వకు కూడ గౌరవం దక్కుతుంది.శ్రద్ద కొరవడినప్పుడు బంగారానికైనా భంగపాటు తప్పదు. 
భగవంతుని పట్ల విశ్వాసం లేనివాడికి అంతటా, అన్నిటా సంశయాలే ఎదురవుతాయి. విశ్వాసపూరితునకు నిస్సంశయంగా అన్నీ సమాధానాలుగానే తోస్తాయి.
మీరందరూ పరిశుద్ధులై, శాంతచిత్తులై ఉండండి. ఈ జన్మలోనే భగవత్సాక్షాత్కారం పొందండి. 
పవిత్ర గ్రంథాలను పఠించడం అలవరుచుకోండి. పనికిమాలిన పుస్తకాలు చదువుతూ కాలాన్ని వృథా చేసుకోకండి. భగవంతునిపట్ల భక్తి విశ్వాసాలు ప్రేరేపించని గ్రంథాలు నిరుపయోగం. అవి పాండిత్య పటాటోపానికి మాత్రమే తగును. నాయనా! దుర్లభమైన ఈ మానవ జన్మను ధన్యం చేసుకోవాలనే తలంపే ఉంటే, ఆత్మోన్నతిని పొందాలనుకొంటే భగవన్నామాన్ని ఆశ్రయించు. ధ్యానసాగరంలో మునిగిపో, ఉత్తినే పైపైనే తేలుతూ ఉండిపోక, అట్టడుగుదాకా రత్నాకరంలో మునిగితేగాని దాన్లోని రత్నాలు చేజిక్కవు సుమా! 'సంగరాహిత్యమే' మానవ జీవిత ఆదర్శమని చాటిచెప్పడానికే శ్రీరామకృష్ణులు ఈ
యుగంలో అవతరించారు. శు జపధ్యానాదుల వలనా, ప్రార్థనల చేతా హృదయ
వికాసం కలుగుతుంది. దానివలన ఒక నూతన దృష్టి దివ్యదృష్టి, అంటే జ్ఞానదృష్టి జనిస్తుంది. అప్పుడు సాధకుడు అనేక ఆధ్యాత్మిక రహస్యాలను ఆవిష్కరించుకో గలుగుతాడు. అంతమాత్రాన లక్ష్యం
సిద్దించినట్లు భావించరాదు. బీజరూపంలో ఉన్న సూక్ష్మ అంతఃకరణానికి భగవంతుని దర్శించ గలిగినంత శక్తిలేదు. అది మానవుణ్ణి భగవంతునికి సన్నిహితుణ్ణి చేస్తుంది. అంతే. ఆ స్థితిని చేరుకొన్నప్పుడు మనిషికి ప్రపంచం యావత్తు నిస్సారంగా కానవస్తుంది. ఇక ఇప్పుడతడి మనస్సు
భగవచ్చింతనలో లగ్నమైపోతుంది . ఓ మానవ దేహంలో భగవంతుడు ఒక ప్రత్యేక స్థానాన్ని
పాదుగొలిపి విరాజిల్లుతున్నాడనే మహాతత్త్వాన్ని
మనస్సులో పదిలపరచుకోవాలి. 4 భగవంతుడు మనవాడు. సులభంగా మనకు దర్శనం
ఇస్తాడు. అందుకు రెండు మార్గాలు ఉన్నాయి. దాన్లో మొదటిది భక్తిమార్గం, రెండవది జ్ఞానమార్గం. ఈ రెండూ భగవత్సాక్షాత్కారాన్ని చేకూర్చేవే. భక్తుడు భగవంతుని రూపం గాంచాలని ఆరాటపడతాడు. అందుకై స్తుతిస్తాడు, నామసంకీర్తన చేస్తాడు. ఆయన దివ్యస్వరూపాన్ని దర్శించగలుగుతాడు. ఒక్కొక్కప్పుడు ఆనందంతో మురిసిపోతాడు.జ్ఞానమార్గావలంబులు ఆత్మజ్యోతిని అన్వేషిస్తారు. అంటే తనలో ఉన్న పరమాత్మను తెలుసుకో ప్రయత్నిస్తారు.
ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు. ఏ రీతిలోనైనా భక్తుడు, జ్ఞాని ఏకమవుతారు; గమ్యం చేరుకొంటారు. నిజానికి ఒక వ్యక్తి ఎలాంటివాడో తెలుసుకోగోరితే అతడి నిత్యవిధులు ఎలాంటివో పరిశీలించాలి. అతడి యథార్థ స్వరూపాన్ని వెల్లడించేవి నిత్యకృత్యాలే. కర్మయోగి అయినవాడు ఏ పనినైనా, చివరకు ఎంత నికృష్టమైన పనినైనా ఏవగించుకోక మనస్ఫూర్తిగా దాన్లో లీనమై చేస్తాడు. జనం మెప్పు పొందాలనే ఆకాంక్ష అతడికి ప్రేరణ కాదు. మానవ జీవిత పరమాదర్శాన్ని ఎన్నడూ మరచిపోకండి. ఆహార నిద్రాదులతోనే పశుప్రాయంగా గడపడానికి ప్రాప్తించింది కాదు ఈ మానవ జన్మ దుర్లభమైన మానవ జన్మను ప్రాప్తించుకొన్నావు కనుక ఇంద్రియ సుఖాలను తృణీకరించి భగవత్సాక్షాత్కారాన్ని, బ్రహ్మానందాన్ని పొందడానికి దీక్ష పూనాలి. భగవద్దర్శన ప్రయత్నంలో మృత్యువును ఎదుర్కోవలసి వచ్చినా బెదరిపోవద్దు. భక్తి, జ్ఞాన పారవశ్యం పొంది శాశ్వతమైన ఆనంద సామ్రాజ్యంలో అడుగిడే ప్రయత్నం చేయాలి.