Monday, July 21, 2025

మేలుకో తెలంగాణోడా! #సల్వాజి మాధవరావు - 90525 63147

  



మేలుకో తెలంగాణోడా!

ఓ తెలంగాణోడా...

ఇప్పటికైనా మేలుకో!

నువ్వు నమ్మిన నీ పల్లెనీ పంటనీ పోరాటం

ఇవన్నీ మళ్లీ పాత పాత బానిసత్వపు

నీడల్లోకి లాగుతున్నారు.

నీకు స్వంత రాజ్యం వచ్చింది.

కానీనీ కష్టానికి సరైన న్యాయం దక్కుతుందా

నీ మట్టిలో నీళ్లు పోశామంటున్నారు

కానీ నీ చిగురు ఎందుకు వాడిపోయింది?

నిన్న నీ నీళ్లకు హక్కు ఉంది

ఇవాళ నీ వంతు నీళ్ల కోసం మళ్లీ నువ్వే

ఎద్దు కట్టుకుని పోవాల్సిన పరిస్థితి వచ్చింది.

నీ పొలం నీదే కానీ పంట తీగల్ని

ఎక్కడ కత్తిరించాలో చెబుతున్నారు వాళ్ళే

నీ విత్తనానికి నువ్వు మూలధనంవె

కానీ పంట నాజూకుదనానికి

మూల్యం చెప్తారు మరొకరే.

ఎన్ని రైతుబంధు మాటలు వినినా

నీ చేతిలో మట్టి లేదు - రుణం ఉంది

నీ కష్టంలో పంట లేదు - కత్తి ఉంది

ఆ కత్తిని మళ్లీ మనల్ని మనమే

పొడుచుకునేలా చేస్తుంది

మన ఉద్యమమే లాభపడదూ

తెలంగాణోడా!

మేలుకో తెలంగాణోడా

ఇది నీ గళంనీ గడ్డనీ గొప్పతనం!!

ఓ తెలంగాణోడా...

నీ నిద్ర ఇంకా ముగియలేదా?

నీ చెమట తడికి పుట్టిన తెలంగాణా నేడు

మళ్లీ చెర గడిలోకి జారిపోతోంది .

నువ్వు పోరాడిన స్వయం పాలన

ఇప్పుడు మరోసారి పరాయివారి చేతుల్లో

నరకంలా మారింది.

నిన్న నీ గొంతు ఉద్యమమైంది ,

నేడు అదే గొంతు మౌనం పట్టింది ,

ఇప్పుడా చేతుల్లో ఉన్నది కేవలం

ఓ రుణపు పట్టా .

నువ్వు నమ్మిన మాటలు మోసం చేశాయి.

రైతుబంధు అంటూ ఇచ్చిన హామీలు,

నీ చేతిలో మట్టి కాదు - అప్పుల కాగితాలని

పెట్టాయినీ భూమి నీదే,

కానీనీ భవిష్యత్తు ఎవరో తేల్చేస్తున్నారు.

ఓ యువకుడా...

నీ కలలు ఖాళీ మాటలే అవుతాయి గాని

నీ అడుగులు ఉద్యమ జాడలై మారిపోవాలి.

ఓ నాయకుడా.. నీ పదవి గొప్ప కాదు,

నీ ప్రజల బాధే నీ బాధగా మారాలి.

ఈ తెలంగాణ నీది!

నీ చెమట తడిచిన గడ్డను

నీ కన్నీటి నీటితో తడిపే గుగురుతో రక్షి

ఓ తెలంగాణోడా...!

అడుగు వేసే ప్రతిచోట....

పొలిమేరలు మళ్లీ నినాదాలతో దద్దరిల

పల్లెలు మళ్లీ చైతున్యంతో దద్దరిల్లాలి

ప్రజల గళమే ఉద్యమానికి మార్గదర్శి కా

ఉద్యమం అంటే కేవలం ధర్నా కాదు

ప్రతి చైతన్యమైన మనిషి మన ప్రాంతానికి

వెన్నుదన్నుగా మారినప్పుడే-

అది నిజమైన ఉద్యమం

రేపటి ఉదయం కోసం ఉద్యమం మళ్లీ

అవసరమే.ఓ తెలంగాణోడా...

ఇప్పటికైనా నిద్రలేవు?

నువ్వు పుట్టించిన ఈ రాష్ట్రం..

ఇప్పుడీ పాలకుల చేతిలో మళ్లీ చెరగంటలు మోగుతోంది !

నీ పోరాటం పండించిన గడ్డ మీద

మళ్లీ పరాయివాళ్ళే పాలకులయ్యారు..

రైతన్నా..నీ మట్టిలో విత్తనం వేస్తే

పంట పుట్టాలి కానీఇప్పుడు రుణాల తాడులు

మాత్రమే మొలుస్తున్నాయి

నీ చెమటను కొనుగోలు చేసే వ్యవస్థ లేదు.

నీ ధైర్యాన్ని చీల్చే పాలకులు మాత్రం

గుట్టలుగా ఉన్నారు! యువతా...

నీ శబ్దం ఎక్కడ?. నీ సోషల్ మీడియా పోస్ట్

ఓ రెవల్యూషన్ కాదు.

నీ పాదం ప్రగతికి పడాలి బాట

నీ గళం మరలా ఉద్యమానికి గర్జించాలి.

ఇంకా ఒక్కసారి అడుగులే నినాదాలవాలి.

పల్లె ప్రతీ మూలలో ఉద్యమం మెరుపులు రావాలి.

ప్రతీ పొలంలో తిరిగి పోరాటపు

పదాలు మొలకెత్తాలి!

ఇదే సమయంలోఇదే పిలుపు:

'ఓ తెలంగాణోడా - మళ్లీ ఉద్యమించు'

'బానిసత్వం భవిష్యత్తుకే బెడద

ఉద్యమమే మన ఓటుకు గౌరవం

మన భూమికిమన నీళ్లకుమన హక్కులకై

మనం మళ్లీ మేలుకోవాల్సిందే!

జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

సల్వాజి మాధవరావు - 90525 63147

NAMASTHE TELANGANA 21 AND 20 JULY 2025

Monday, July 14, 2025

#దత్తాత్రేయ-వేణుగాన-విద్వాంసులు#దత్తాత్రేయ

 



దత్తాత్రేయ 1956 జూన్ 1వ తేదీన జన్మించారు. దేవుని అలువవాల్ , సికిందరాబాద్ ,తెలంగాణ రాష్ట్రం.వృత్తి వేణుగాన విద్వాంసులు. దత్తాత్రేయ జననం దత్తాత్రేయ 1956 జూన్ 1 India దేవుని అలువవాల్,సికిందరాబాద్ తెలంగాణ రాష్ట్రం వృత్తి వేణుగాన విద్వాంసులు ప్రసిద్ధి వేణుగాన విద్వాంసులు మతం హిందూ తండ్రి బాబురావు జ్యోషి తల్లి రుక్మిణి దత్తాత్రేయ రంగారెడ్డిజిల్లా, దేవుని అలువాలలో బాబురావు జ్యోషి, రుక్మిణి దంపతులకు జన్మించారు. వీరి నాన్నగారు ప్రఖ్యాత హిందుస్తానీ గాయకులు. వీరి కుటుంబీకులు వృత్తి రీత్యా గ్రామ పౌరోహిత్యులు. దత్తాత్రేయ చిన్నప్పటినుండి నాన్నగారి వద్ద హిందుస్తానీ గాత్రము సాధన చేశారు. 18 సంవత్సరాల వరకు గాత్రము సాధన చేసి 1964 వ సంవత్సరంలో ప్రముఖ పండిత్.హరిప్రసాద్ చౌరసియా గారికచేరి నాన్నగారితో కలిసి వెళ్లి వారి వేణు వాద్యంతో స్ఫూర్తిని పొంది ఎలాగైనా వేణువు నేర్చుకుందామని నిశ్చయించుకున్నారు. కానీ అప్పట్లో వేణువు నేర్పించే గురువులు లేకపోవడం వల్ల నాన్నగారి పర్యవేక్షణలోనే సంగీత పాఠాలు వేణువుపై స్వయంగా సాధనచేసి రేడియో ఆడిషన్లో ఉత్తీర్ణత పొంది యువవాణి కార్యక్రమం ద్వారా సంగీత ప్రయాణం మొదలుపెట్టారు. ఆ తరువాత ప్రముఖ కర్ణాటక వేణు విద్వాంసులు శ్రీ ఎన్.ఎస్ శ్రీనివాసన్ గారు ఎంతో వాత్సల్యంగా కర్ణాటక సంగీత పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. జీవిత విశేషాలు 1980వ సంవత్సరం నుండి ప్రదర్శనలు మొదలుపెట్టారు. మొట్టమొదటిగా హైదరాబాద్ దూరదర్శన్ లో యోగివేమన అనే తెలుగు టెలీ ఫిలింతో మొదలై అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరి నాన్నగారు కిరానా ఘరానా సంప్రదాయానికి చెందిన హిందుస్తానీ సంగీత విద్వాంసులగుట చేత శాస్త్రీయ సంగీతం మాత్రమే వాయించమని సినిమా పాటలు వద్దు అని చెప్పేవారు. నాన్నగారు 1979 వ సంవత్సరంలో మరణించారు. ఆ తరువాత కుటుంబ భారం తనపై పడటంవలన కుటుంబ అవసరాలకొరకు అన్నిరకాలైన ప్రదర్శనలకు వేణువు వాయించడం మొదలుపెట్టారు. అప్పుడు హైదరాబాదులో బాన్సురి వాయించే వారు ఎవరూ లేకపోవుట వలన విరివిగా అవకాశాలు వచ్చాయి. సినిమా రికార్డింగ్స్, స్టేజ్ ప్రోగ్రాములు ఎక్కువగా మొదలయ్యి అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. 1981 వ సంవత్సరంలో ఒక జూనియర్ కళాశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్ గా సెలెక్ట్ అయ్యి ఉద్యోగంలో చేరారు. అదే సమయంలో రికార్డింగ్స్ కూడా చాలా ఎక్కువ అయి సెలవులు దొరకకపోవడం వల్ల ఎంతో ఇబ్బందిపడ్డారు. దీనికి తోడుగా వీరి గురువుగారు ఎన్ ఎస్ శ్రీనివాసన్ గారు ప్రముఖ నృత్య కళాకారులకు నేను కర్ణాటక సంగీతం కూడా వాయిస్తానని చెప్పి వారందరికీ నన్ను పరిచయం చేశారు. ఆ నృత్య కళాకారులు విదేశీ పర్యటనలు నెలల తరబడి చేసేవారు. ఒకసారి 1986లో మూడు నెలలు పాటు సౌత్ ఈస్ట్ కంట్రీస్ వెళ్లవలసి వచ్చి, ఉద్యోగంలో కొనసాగించడం ఇకపై కష్టమని ఆరు సంవత్సరాలుగా చేసిన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తరువాత, సమయం మొత్తం సంగీతానికే కేటాయించుకుని సాధన చేశారు. ఈ ప్రయాణంలో ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులను కలుసుకోవటం మరియు వారితో కలిసి కార్యక్రమాలు చేయడంజరిగింది. సంగీత ప్రస్థానం వీరు కలిసిన కొంతమంది ప్రముఖుల్లో గాయకులు పద్మశ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు, పద్మశ్రీగులాం అలీ ఖాన్ గారు, నృత్య కళాకారులు హైదరాబాదుకు చెందిన పద్మశ్రీశోభా నాయుడుగారు ఉమా రామారావుగారు ఢిల్లీకి చెందిన పద్మశ్రీ రాజారెడ్డి రాధారెడ్డిగారు, పద్మశ్రీ జయ రామారావుగారు, వనశ్రీ జయరామారావుగారుమద్రాస్ కి చెందిన అ లర్ మెయిల్ వల్లిగారు ఇలా ఇంకా ఎంతోమంది కళాకారులు. వీరి గురువుగారైన శ్రీనివాసన్ గారు ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ రికార్డింగ్స్ చేసేవారు వాటికి గురువుగారికి స్వరాలు రాయడంలో ఉపకరిస్తుండేవారు. వాటిలో వాటిల్లో ఢిల్లీ నుంచి ప్రసారమయ్యే యుజిసి కార్యక్రమాలు ఎన్నో ఉండేవి. ఇతర అంశాలు వీరు ఆల్ ఇండియా రేడియోలో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో మరియు లలిత సంగీతం రెండిట్లోనూ గ్రేడెడ్ ఆర్టిస్ట్ గా ఉన్నారు. 45 సంవత్సరాలుగా ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, ప్రాంతీయ చిత్రాలు, డాక్యుమెంటరీలు స్టేజ్ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. వీరు 10 వేలకు పైగా ఆడియో ఆల్బమ్సలో వేణువు సహకారం అందించి సంగీతం సమకూర్చారు. చాలామంది ఔత్సాహికులకు వేణువాద్యంలో శిక్షణఇస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారు. విదేశీ పర్యటనలు ఎంతోమంది ప్రఖ్యాతి పొందిన కళాకారులకు వేణు వాద్య సహకారం అందిస్తూ దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చర్ రిలేషన్స్, ఢిల్లీ వారి సౌజన్యంతో వేణువాదకుడిగా అనేకమంది కళాకారులతో ఇతర దేశాల్లో ఎన్నో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సంగీత నృత్య ఉత్సవాల్లో పాల్గొన్నారు. 1983 వ సంవత్సరంలో మొదటిసారిగా మారిష్యస్ దేశానికి. 1984 సంవత్సరంలో సౌదీస్టు కంట్రీస్ హాంగ్ కాంగ్, మక్కావ్, బ్యాంకాక్, వియత్నాం, కాంబోడియా, లావోస్, సింగపూర్, ఇండోనేషియా. 1985 వ సంవత్సరంలో అమెరికాలో ఫెస్టివల్ ఆఫ్ ఇండియాఉత్సవం న్యూయార్క్ లో మరియు వాషింగ్టన్ లో. 1986వ సంవత్సరంలో సౌత్ అమెరికా ప్రతిష్టాత్మకమైన సర్వెంటినో ఫెస్టివల్ 1993 వ సంవత్సరంలో యూఎస్ఏ హార్వర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మూడు నెలలు. 1996 వ సంవత్సరంలో జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్. 1996 యూఎస్ఏ 1998 యూఎస్ఏ 2008 వ సంవత్సరంలో జర్మనీ, ఇటలీ, వెనీస్ 2006 వ సంవత్సరంలో అమెరికా 2007 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా జోహాన్నస్ బర్గ్, కేప్ టౌన్ మరియు దర్బన్ 2010 సంవత్సరంలో కెనడా 2017 వ సంవత్సరంలో రష్యా మరియు జార్జియా మొదలైన 25 దేశాలు సత్కారాలు 1996లో గౌరవ హానరరీ సిటిజన్షిప్ ఆఫ్ అమెరికా 2014లో కంచి ఆస్థాన విధ్వంసుడిగా సన్మాన పొందారు 2006వ సంవత్సరంలో ఘంటసాల గోల్డ్ మెడల్